జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల తనిఖీ
ABN , First Publish Date - 2021-11-21T06:06:57+05:30 IST
జి.మామిడాడ జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు డి.మధుసూదన్ సందర్శించి రికార్డులు పరిశీలించారు.

పెదపూడి, నవంబరు 20: జి.మామిడాడ జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను విద్యాశాఖ ప్రాంతీయ సంచాలకుడు డి.మధుసూదన్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు అమలు చేస్తున్న భాషాభివృద్ధి కార్యక్రమం, లిప్ ప్రోగ్రామ్లను వివరించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు. ఆయన వెంట తహశీల్దారు టి.సుభాష్, హెచ్ఎంలు కె.శ్రీనివాస్, వి.లక్ష్మి ఉన్నారు.