పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం

ABN , First Publish Date - 2021-10-29T05:44:32+05:30 IST

రాజమహేంద్రవరంలో మెరుగైన పారిశుధ్యం అందించేందుకు శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నామని కార్పొ రేషన్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు.

పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 28: రాజమహేంద్రవరంలో మెరుగైన పారిశుధ్యం అందించేందుకు శానిటేషన్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నామని కార్పొ రేషన్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. గురువారం నగరంలో 5, 8 డివిజన్లలో తడిపోడి చెత్తసేకరణ విధానాన్ని ఆయన పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. అలాగే వైద్యపరమైన వ్యర్థాలు, అవశేషాలు, సూదులు, సిరంజిలు, నాపి ప్యాడ్‌లు ఎరుపు రంగు డస్ట్‌బిన్నుల్లో మాత్రమే వేయాలన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా వుంచడంలో ప్రజలందరు సహకరించాలన్నారు. అనంతరం ఆయన క్వారీపేటలోని చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎంహెచ్‌వో డాక్టర్‌ వినూత్న, ఎస్‌ఎస్‌, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు ఉన్నారు. 

Updated Date - 2021-10-29T05:44:32+05:30 IST