సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-06-24T04:47:12+05:30 IST
సామర్లకోట, జూన్ 23: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సామర్లకోట మున్సిపల్ రెగ్యులర్, కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ నాయకుడు చంద్రయ్యదాసు ఆధ్వర్యంలో డిమాండ్లతో
సామర్లకోటలో మున్సిపల్ రెగ్యులర్, కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికుల ధర్నా
సామర్లకోట, జూన్ 23: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సామర్లకోట మున్సిపల్ రెగ్యులర్, కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం యూనియన్ నాయకుడు చంద్రయ్యదాసు ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ కమిషనర్ శేషాద్రికి అందజేశారు. ఈ సందర్భంగా తమ ప్రధాన డిమాండ్లను వారు వివరిస్తూ రెగ్యులర్ కార్మికులకు హాజరును సచివాలయాల్లో కాకుండా శానిటేషన్ విభాగంలోనే తీసుకోవాలన్నారు. వేతనాలు పెంచాలన్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సత్వరం వేతనాలు పెంచాలన్నారు. పారిశుధ్య కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేసారు. ధర్నాలో యూనియన్ నాయకులు బొచ్చాశ్రీను, చెన్నా వెంకటేష్, మల్లిపూడి శ్రీలక్ష్మి, సింగంపల్లి శ్రీనివాస్, మిరియాల రాజు, చెన్నా లక్ష్మీపైడిరాజు తదతర పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.