కాలుజారి సీలేరు నదిలో గల్లంతైన యువకుడు
ABN , First Publish Date - 2021-03-22T06:01:20+05:30 IST
చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పొల్లూరులో కాలు జారి సీలేరు నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు.
![కాలుజారి సీలేరు నదిలో గల్లంతైన యువకుడు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మోతుగూడెం, మార్చి 21: చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని పొల్లూరులో కాలు జారి సీలేరు నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. డొంకరాయికి చెందిన ఆటోడ్రైవర్ గంగిరెడ్ల రాంబాబు(22) బహిర్భూమికని సీలేరు నది ప్రాంతానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి గల్లంతైనట్లు సమాచారం. ఆ యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.