రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-11-02T05:42:14+05:30 IST

కత్తిపూడి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కాండ్రకోట గ్రామానికి చెందిన షేక్‌ దునియాబీ (34) తొండంగి మండలం వలసపాకలలోని బంధువుల ఇంటికి వెళ్లింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

శంఖవరం, నవంబరు 1: కత్తిపూడి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కాండ్రకోట గ్రామానికి చెందిన షేక్‌ దునియాబీ (34) తొండంగి మండలం వలసపాకలలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో రాచపల్లి వెళ్తుండగా కత్తిపూడి బ్రిడ్జిపై లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-11-02T05:42:14+05:30 IST