ప్రైవేట్‌ బస్సును ఢీకొన్న ఆటో

ABN , First Publish Date - 2021-12-08T05:27:45+05:30 IST

రాజమహేంద్రవరం ఆల్కాట్‌ గార్డెన్స్‌ రోడ్డు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో మంగళవారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఓ ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరు ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

ప్రైవేట్‌ బస్సును ఢీకొన్న ఆటో

 ఆటోడ్రైవర్‌ మృతి.. ఇద్దరికి స్వల్పగాయాలు
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 7: రాజమహేంద్రవరం ఆల్కాట్‌ గార్డెన్స్‌ రోడ్డు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో మంగళవారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఓ ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరు ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. టూటౌన్‌ పోలీసులు కథనం ప్రకారం.. ధవళేశ్వరం సున్నంబట్టి వీధికి చెందిన ఎస్‌.రవికుమార్‌(36) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇద్దరు ప్రయాణికులను స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఆటో ఎక్కించుకుని ధవళేశ్వరం బయలుదేరాడు. విజయనగరం ప్రాంతానికి చెందిన అప్పయ్యస్వామి భక్తులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ధవళేశ్వరం నుంచి రాజమహేంద్రవరం వస్తోంది. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలోకి వచ్చేసరికి ఆటో వేగంగా బస్సును ఢీకొంది. ఆటో డ్రైవర్‌ రవికుమార్‌ బస్సు చక్రాల కిందిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న టూటౌన్‌ పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. రవికుమార్‌ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.

Updated Date - 2021-12-08T05:27:45+05:30 IST