రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2021-12-07T05:15:38+05:30 IST
పిఠాపురం మండలం పి.తిమ్మాపురం-వెల్దుర్తి మధ్య సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు
పిఠాపురం
రూరల్, డిసెంబరు 6: పిఠాపురం మండలం పి.తిమ్మాపురం-వెల్దుర్తి మధ్య
సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరు తీవ్రంగా
గాయపడ్డారు. వెల్దుర్తి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు
మోటార్సైకిల్పై పి.తిమ్మాపురంలో కూలీ పనికి వెళ్లి తిరిగివస్తున్నారు.
మార్గమధ్యంలో మోటార్సైకిల్ అదుపు తప్పడంతో దువ్వాల సింహాచలం అక్కడికక్కడే
మరణించగా, మణికుమార్, దేవారపు సూరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని
చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిఠాపురం
రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.