రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2021-01-21T06:13:46+05:30 IST
పిఠాపురం మండలం చిత్రాడ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
మరో ఇద్దరికి గాయాలు
పిఠాపురం రూరల్, జనవరి 20: పిఠాపురం మండలం చిత్రాడ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పిఠాపురంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న మలిరెడ్డి వెంకట్రాజు మోటార్సైకిల్పై కాకినాడ నుంచి పిఠాపురం వస్తున్నారు. అదే సమయంలో ఎదురుగా తూరల లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. మరో మోటార్సైకిల్ను కూడా ట్రాక్టర్ ఢీకొనడంతో చొల్లంగికి చెందిన వెంకటరమణ, అతని భార్యకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.