రిమాండ్‌ ఖైదీ మృతి

ABN , First Publish Date - 2021-07-12T05:36:48+05:30 IST

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కిల్లో సుడోన్‌ (37) ఆదివారం సాయంత్రం స్థానిక ప్ర భుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు.

రిమాండ్‌ ఖైదీ మృతి

రాజమహేంద్రవరం సిటీ, జూలై 11: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న కిల్లో సుడోన్‌ (37) ఆదివారం సాయంత్రం స్థానిక ప్ర భుత్వ ఆసుపత్రిలో మృతి చెందాడు. జైలు అఽధికారుల వివ రాల ప్రకారం.. తూర్పు ఏజెన్సీ ధారకొండకు చెందిన కిల్లో సుడోన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో గంజాయి కేసులో పట్టుబడి రిమాండ్‌పై రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు వచ్చాడు. అప్పటి నుంచి జైలులో ఉన్న అతడికి ఆదివారం మధ్యాహ్నం వాంతులు అయ్యాయి. దీంతో జైలు అధికారులు అతడిని రాజమహేంద్రవరం ప్రభు త్వాసుపత్రికి తరలించగా సాయ ంత్రానికి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ మేరకు అతని కుటు ంబానికి జైలు అఽధికారులు సమా చారం అందించారు.

Updated Date - 2021-07-12T05:36:48+05:30 IST