ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2021-05-16T05:44:38+05:30 IST
కూనవరం, మే 15: రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసన వ్యక్తిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన జోడె నాగేశ్వరరావు వీఆర్పురం మండలం వడ్డిగూడెం గ్రామ సచివాలయంలో
కేసు నమోదు
కూనవరం, మే 15: రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసన వ్యక్తిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... కూనవరం మండలం టేకులబోరు గ్రామానికి చెందిన జోడె నాగేశ్వరరావు వీఆర్పురం మండలం వడ్డిగూడెం గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఎమ్మెల్యే గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తుందంటూ తన వాట్సాప్ స్టేట్సలో అసభ్య పదజాలాలతో పోస్టు చేశాడు. దీనిపై కొందరు అడ్డతీగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అక్కడ పోలీసులు కూనవరం వచ్చి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు.