ఏఎస్వో మృతికి పలువురి సంతాపం
ABN , First Publish Date - 2021-04-14T06:15:43+05:30 IST
అమలాపురం డివిజనల్ సివిల్ సప్లయ్ అధికారి(ఏఎస్వో) జగడం ఆనంద్కుమార్(45) ఆకస్మికంగా మృతిచెందడంపై పలువురు సంతాపం తెలిపారు.
అమలాపురం టౌన్, ఏప్రిల్ 13: అమలాపురం డివిజనల్ సివిల్ సప్లయ్ అధికారి(ఏఎస్వో) జగడం ఆనంద్కుమార్(45) ఆకస్మికంగా మృతిచెందడంపై పలువురు సంతాపం తెలిపారు. ఇటీవల కొవిడ్ పాజి టివ్ రావడంతో ఉన్నత వైద్యం కోసం తరలిస్తుండగా సోమవారం మృతిచెందారు. ఆనంద్కుమార్ మృతికి సబ్కలెక్టర్ హిమాన్షుకౌశిక్, కార్యాలయ పరిపాలనాధికారి జవ్వాది వెంక టేశ్వరి, రెవెన్యూ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వాసా ఎస్.దివాకర్, తహశీల్దార్ జి.రవీంద్రనాథ్ఠాగూర్, డిప్యూటీ తహశీల్దార్ పలివెల అశోక్ప్రసాద్, వీఆ ర్వోల సంఘ అధ్యక్షుడు సాధనాల యెల్లేశ్వరరావు సంతాపం తెలిపారు.