సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు
ABN , First Publish Date - 2021-08-27T05:31:58+05:30 IST
సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమె రాలు ఖచ్చితంగా ఉండాలని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశించారు.
![సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 26: సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమె రాలు ఖచ్చితంగా ఉండాలని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశించారు. రాజమహేం ద్రవరం అర్బన్ జిల్లా ఈస్ట్ జోన్ పోలీస్ అధికారులతో ఎస్పీ తన కార్యాలయం లో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈస్ట్జోన్ పరిధిలో 174సీఆర్పీసీ, మిస్సింగ్, మహిళలు, బాలికలపై అత్యాచారాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమీక్షించారు. రాత్రి గస్తీ, పెట్రోలింగ్ నిర్వహణపై ఆరా తీశారు. సమావేశంలో ఈస్ట్జోన్ డీఎస్పీ ఏటీవీ రవికుమార్, బొమ్మూరు, ప్రకాష్నగర్, రాజానగరం సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.