పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు సాయం
ABN , First Publish Date - 2021-10-23T06:08:25+05:30 IST
పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.10వేలు సాయం అందిస్తుందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పేరి శ్రీను తెలిపారు.
అంబాజీపేట, అక్టోబరు 22: పేద బ్రాహ్మణుల అంత్యక్రియలకు ప్రభుత్వం రూ.10వేలు సాయం అందిస్తుందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పేరి శ్రీను తెలిపారు. గరుడ సహాయ పఽథకంలో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరణించిన వ్యక్తికి చట్టబద్దమైన వారసుడు ద్వారా తెల్లరేషన్కార్డు కలిగి 40 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈపఽథకాన్ని పునరుద్ధరించేందుకు కృషిచేసిన సీఎం జగన్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్కు ఆయన అభినందనలు తెలిపారు.