ఘనంగా ప్రారంభమైన మరిడమ్మ జాతర
ABN , First Publish Date - 2021-07-09T05:22:50+05:30 IST
పెద్దాపురం, జూలై 8: కోరిన కోర్కెలు తీర్చే మరిడమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం కొవిడ్ నిబంధనల నడుమ ప్రారంభమయ్యాయి. ఆలయ అసిస్ట్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మీ, ఆలయ ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో మేళతాళాలు
పెద్దాపురం, జూలై 8: కోరిన కోర్కెలు తీర్చే మరిడమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం కొవిడ్ నిబంధనల నడుమ ప్రారంభమయ్యాయి. ఆలయ అసిస్ట్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మీ, ఆలయ ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ ఆధ్వర్యంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ జాతర ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రదక్షిణ చేయించారు. భక్తులు గరగలకు హారతుల ఇచ్చి పసుపునీటితో గరగల కాళ్లు కడిగిగారు. అమ్మవారిని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు కమిషనర్ విజయలక్ష్మీ, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆర్జేసీ సురే్షబాబు, డీసీ ఎం.విజయరాజు అమ్మవారిని దర్శించుకున్నారు. జాతరలో అవాంఛనీయ సంఘటన లు జరక్కుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.