ముంపుబారిన పంటపొలాలు

ABN , First Publish Date - 2021-07-13T05:26:24+05:30 IST

లొల్ల లాకులకు సమీపంలోని లొల్ల ఆయకట్టు పరిధిలోని పంటపొలాలు ముంపునకు గురికావడంతో ఆకుమడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ముంపుబారిన పంటపొలాలు

ఆత్రేయపురం, జూలై 12: లొల్ల లాకులకు సమీపంలోని లొల్ల ఆయకట్టు పరిధిలోని పంటపొలాలు ముంపునకు గురికావడంతో ఆకుమడులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లొల్ల లాకుల ద్వారా ప్రధానకాల్వలకు సాగునీరు ప్రవహిస్తోంది. శివారు ప్రాంతాలకు సాగునీరు వెళ్తున్న సమయంలో పల్లపు ప్రాంతం కావడంతో తరచూ ముంపుబారిన పడుతోంది. ఈనేపఽథ్యంలో లొల్ల, వాడపల్లి, మెర్లపాలెం, ఆత్రేయపురం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 300ఎకరాలు ముంపుబారిన పడుతోంది. ప్రస్తుతం ఆకుమడులు, వరినాట్లు నీటమునిగాయి. ఇరిగేషన్‌ డీఈ వెంకటేశ్వరరావు, ఏఈ పిల్లా సత్యనారాయణ రైతుల పంటపొలాలను పరిశీలించి రైతులతో చర్చించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. 

Updated Date - 2021-07-13T05:26:24+05:30 IST