పేదలు, పోలీసులకు మెడికల్‌ క్యాంప్‌

ABN , First Publish Date - 2021-10-29T05:46:25+05:30 IST

పేదలు, పోలీస్‌ కుటుంబాల కోసం ఉచిత మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్టు రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అన్నారు.

పేదలు, పోలీసులకు మెడికల్‌ క్యాంప్‌

రాజమహేంద్రవరం సిటీ,అక్టోబరు 28: పేదలు, పోలీస్‌ కుటుంబాల కోసం ఉచిత మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్టు రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం పాత ఏఆర్‌ గ్రౌండ్స్‌లో అర్బన్‌ జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ శిబిరంలో పోలీస్‌ కుటుంబాలతోపాటు చట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారని చెప్పారు. జనరల్‌ ఫిజిషియన్‌, డెంటిస్ట్‌, ఆర్ధోపెటిక్‌, నెఫ్రాలజిస్ట్‌, గైనకాలజిస్ట్‌ విభాగాల్లో వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీలు కె.లతామాధురి, సీహెచ్‌ పాపారావు, ఏఆర్‌ డీఎస్పీ వి.సత్తిరాజు, అర్‌ఐ సంజీవ్‌కుమార్‌, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రఘురాం పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:46:25+05:30 IST