మార్కెట్లకు శ్రావణ శోభ

ABN , First Publish Date - 2021-08-20T05:56:06+05:30 IST

శ్రావణ మాసం అంటేనే భక్తులకు ప్రీతికరమైన మా సం. దీంతో నగరంలో బంగారం షాపులు, వ్రత పూజల సామగ్రి, నూతన వస్త్రాలు కొనేందుకు ప్రజలు అధికసంఖ్యలో బయటకు వచ్చారు.

మార్కెట్లకు శ్రావణ శోభ

కిక్కిరిసిన రహదారులు 

భానుగుడి(కాకినాడ), ఆగస్టు 19: శ్రావణ మాసం అంటేనే భక్తులకు ప్రీతికరమైన మా సం. దీంతో నగరంలో బంగారం షాపులు, వ్రత పూజల సామగ్రి, నూతన వస్త్రాలు కొనేందుకు ప్రజలు అధికసంఖ్యలో బయటకు వచ్చారు. అన్నిరకాల పండ్ల దగ్గర నుంచి మామిడి ఆకు లు, బంతి, చామంతి పువ్వులు ఇలా చెప్పుకుం టూ పోతే చాలా రకాలు అమ్మవారి వద్ద పెట్టి పూజలు చేస్తారు. 

పిఠాపురం: మార్కెట్లకు వరలక్ష్మి వ్రత శోభ చేకూరింది. శ్రావణమాసంలో మహిళలు అత్యం త భక్తిశ్రద్దలతో ఆచరించే వరలక్ష్మి వ్రతానికి అవసరానికి అవసరమైన పూజా సామగ్రిని కొనుగోలు చేసేందుకు గురువారం ఉదయం నుంచే ప్రజలు మార్కెట్లకు పోటెత్తారు. బంగా రు రూపులు కొనుగోలు చేసేవారితో దుకాణాలు, రహదారులన్నీ కిక్కిరిసి కనిపించాయి. మార్కె ట్‌, కోటగుమ్మం సెంటర్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పాదగయ పుష్కరిణిలో నీరు లేకపోవడంతో మహిళలు గోదావరి, ఏలేరు కాలువల్లో స్నానాలు ఆచరించడం కనిపించింది.

పెరిగిన ధరలు 

సామర్లకోట: శ్రావణమాసం రెండవ శుక్ర వారం పురష్కరించుకుని గురువారం సామర్లకో ట మార్కెట్లో పత్రి, పూలు, పండ్లు విక్రయాలకు నామమాత్రపు స్పందన కనిపించింది. కరోనా కారణంగా ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురికావడం, జీవనం కష్టంగా ఉన్న నేపథ్యంలో శ్రావణశుక్రవారం వ్రత పూజలు ఎలా నిర్వహిం చాలి అని పలువురు ఆందోళన చెందుతున్నారు. నాలుగు చామంతి పువ్వులు రూ. 10 పలుకగా, రెండు జామకాయలు రూ.25లు కాగా రెండు మొక్కజొన్న పొత్తులు రూ.20చొప్పున ఉన్నాయి.



Updated Date - 2021-08-20T05:56:06+05:30 IST