123 బస్తాల రేషన్బియ్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-07-12T05:30:00+05:30 IST
పిఠాపురం రూరల్, జూలై 12: మండలంలోని మాధవపురంలో సివిల్ సప్లయిస్ అధికారులు దాడులు నిర్వహించి 123 బస్తాల్లో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బండి గంగారావు ఇంటిలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్టు అందిన సమాచారంతో ఏఎ్సవో
![123 బస్తాల రేషన్బియ్యం స్వాధీనం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
పిఠాపురం రూరల్, జూలై 12: మండలంలోని మాధవపురంలో సివిల్ సప్లయిస్ అధికారులు దాడులు నిర్వహించి 123 బస్తాల్లో ఉన్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బండి గంగారావు ఇంటిలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్టు అందిన సమాచారంతో ఏఎ్సవో ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించి 6(ఎ) కేసు నమోదు చేశారు. బియ్యం 45-50క్వింటాళ్లు ఉంటుందని అంచనా. తనిఖీల్లో ఎంఎ్సవో లక్ష్మీరమణ, ఫుడ్ ఇన్స్పెక్టర్ సాయిరాం పాల్గొన్నారు.