లారీ డ్రైవర్పై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-07-27T06:24:10+05:30 IST
లారీతో ద్విచక్ర వాహనచోదకుడిని ఢీకొట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన లారీ డ్రైవర్పై కేసు నమోదుచేసినట్టు నగరం ఎస్ఐ షేక్ జానీబాషా తెలిపారు.
మామిడికుదురు, జూలై 26: లారీతో ద్విచక్ర వాహనచోదకుడిని ఢీకొట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన లారీ డ్రైవర్పై కేసు నమోదుచేసినట్టు నగరం ఎస్ఐ షేక్ జానీబాషా తెలిపారు. ఈనెల20న వైనతేయ వారధిపై విజయ వాడకు చెందిన లారీ డ్రైవర్ ఓ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టి పరార య్యాడు. ఈప్రమాదంలో రాజోలుకు చెందిన ఒక యువకుడు తీవ్ర గాయాల పాలవగా అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు కోమాలోకి వెళ్లడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.