మద్యంషాపు తొలగించాలని జడ్పీచైర్మన్కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-12-09T05:30:00+05:30 IST
మండలంలోని గూడాల పరిధిలో మద్యంషాపు తొలగించాలని పదిరోజులుగా ఆందోళన చేస్తున్నా ఎక్సైజ్శాఖ పట్టించుకోవడంలేదని జడ్పీచైర్మన్ విప్ప ర్తి వేణుగోపాలరావుకు ఫిర్యాదు చేశారు.

అల్లవరం, డిసెంబరు 9: మండలంలోని గూడాల పరిధిలో మద్యంషాపు తొలగించాలని పదిరోజులుగా ఆందోళన చేస్తున్నా ఎక్సైజ్శాఖ పట్టించుకోవడంలేదని జడ్పీచైర్మన్ విప్ప ర్తి వేణుగోపాలరావుకు ఫిర్యాదు చేశారు. తాడికోన రోడ్డులో మద్యంషాపు తొలగించేందుకు సహకరించాలంటూ కాకినాడ జడ్పీ కార్యాలయంలో చైర్మన్కు తాడికోన గ్రామస్థులు గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. తాడికోన రోడ్డులో ఎక్సైజ్శాఖ మ ద్యంషాపువద్ద సర్పంచ్ సాధనాల వెంకటసూర్యనాగమణి ఆధ్వర్యంలో మహి ళలు, గ్రామస్థులు పదోరోజైన గురువారం 8 గంటలపాటు ధర్నా చేశారు. సాధనాల నాగబాబు, దాసరి అప్పలస్వామి, సాధనాల వెంకటరామారావు, ఉండ్రు సత్యనారాయణ, దాసరి సత్తిబాబు, కత్తుల బాబూరావు కాకినాడలో జడ్పీచైర్మన్కు వినతిపత్రాన్ని అందజేసి తమకు న్యాయంచేయాలని కోరారు.