మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది వైఎస్సే

ABN , First Publish Date - 2021-10-19T05:37:16+05:30 IST

డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు.

మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది వైఎస్సే

కాజులూరు, అక్టోబరు 18: డ్వాక్రా సంఘాల ద్వారా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాజులూరులో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఆసరా రెండో విడత పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాజులూరు మండలంలో 26గ్రామాల పరిధిలో 1499 గ్రూపులకు మంజూరైన 12కోట్ల59లక్షల 96వేల చెక్కులను మంత్రి వేణు డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సింధూ సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో కర్రి భీమేశ్వర్‌, ఐకేపీ ఏపీఎమ్‌ అనిల్‌కుమార్‌, ఏరియా కోఆర్డినేటర్‌ పరమేశ్వరరావు, నియోజకవర్గ వైసీపీ నాయకుడు గుబ్బల ఏసురాజు, జెడ్‌పీ మాజీ చైర్మన్‌ గుత్తుల బులిరాజు, ఎంపీపీ మాతా భారతి మురళీ, జెడ్‌పీటీసీ సుబ్బారావు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-19T05:37:16+05:30 IST