రంగుమారిన ధాన్యానికీ మద్దతు ధర: ఆర్డీవో

ABN , First Publish Date - 2021-12-16T05:08:58+05:30 IST

కరప, డిసెంబరు 15: రంగుమారిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లిస్తామని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మండలంలోని వాకాడలో బుధవారం పర్యటించి రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 7

రంగుమారిన ధాన్యానికీ మద్దతు ధర: ఆర్డీవో
వాకాడలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో చిన్నికృష్ణ

కరప, డిసెంబరు 15: రంగుమారిన ధాన్యానికి కూడా మద్దతు ధర చెల్లిస్తామని కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మండలంలోని వాకాడలో బుధవారం పర్యటించి రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 75 కిలోల సాధారణ రకానికి కనీస మద్దతు ధరను రూ.1,455గా  ప్రభుత్వం నిర్ధారించిందన్నారు. పలువురు రైతులు దళారులను ఆశ్రయించి రంగుమారిన ధాన్యాన్ని తక్కువ ధరకే అమ్ముకుంటున్నారన్నారు. ఈ దుస్థితి నుంచి రైతులను కాపాడేందుకు రంగుమారిన ధాన్యానికి కూడా రూ.1,455 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే 75 కిలోలకు అదనంగా మరో ఏడుకిలోలు కలిపి 82కిలోల తూకంతో ధాన్యం అమ్మాలని కోరారు. దీనికి హమాలీల కూలీ, రవాణా చార్జీలు అదనమన్నారు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసి దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఆర్‌బీకేల ద్వారా ధాన్యం  అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఓటీఎస్‌ పథకంపై సమీక్ష జరిపారు. 2014-19 మధ్య ఇంటి పట్టాలు పొంది ఎటువంటి రుణం తీసుకోని లబ్ధిదారులకు కేవలం రూ.10కే రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని ఆర్డీవో చెప్పారు.

Updated Date - 2021-12-16T05:08:58+05:30 IST