నేడు కాకినాడ కార్పొరేషన్‌ సమావేశం

ABN , First Publish Date - 2021-10-29T07:14:37+05:30 IST

కాకినాడ నగరపాలక సంస్థ కొత్త మేయర్‌ సుంకర శివప్రసన్న కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేయర్‌ స్వయంగా కార్పొరేటర్లకు సందేశం పంపారు.

నేడు కాకినాడ కార్పొరేషన్‌ సమావేశం

  • అత్యవసర పనులుంటే తెలపండి.. కార్పొరేటర్లకు మేయర్‌ సంక్షిప్త సందేశం

కార్పొరేషన్‌(కాకినాడ), అక్టోబరు 28: కాకినాడ నగరపాలక సంస్థ కొత్త మేయర్‌ సుంకర శివప్రసన్న కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేయర్‌ స్వయంగా కార్పొరేటర్లకు సందేశం పంపారు. కౌన్సిల్‌ సమావేశానికి అత్యవసర పనులుంటే తెలపాలని దాని సారాంశం. ఈనెల 29వతేదీ ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త మేయర్‌ అధ్యక్షతన జరుగుతున్న తొలి సమావేశం కావడంతో అజెండాలో అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సర్వసభ్య సమావేశం అజెండాలకు పరిపాలనాపరమైన ఐదు అంశాలు తీసుకువచ్చారు. 43వ డివిజన్‌ ప్రతాప్‌నగర్‌లో మాలకొండయ్య స్కూల్‌ ఆవరణలోని ఖాళీస్థలంలో ప్రతిపాదించిన అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 38వ డివిజన్‌ గాంధీనగర్‌ సుబ్బారావువీధిలోని మున్సిపల్‌ స్థలంలోకి మార్పు చేసే అంశాన్ని పొందుపరిచారు. మేడలైన్‌పై రోప్‌ వే బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదన అజెండాలో ఉంది.

Updated Date - 2021-10-29T07:14:37+05:30 IST