జనసేనలో దళితుల చేరిక
ABN , First Publish Date - 2021-10-25T05:56:10+05:30 IST
ఉప్పలగుప్తం, అల్లవరం, అమ లాపురం మండలాలకు చెందిన వంద మందికిపైగా దళిత నాయకులు, యువత ఆదివారం నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వ ర్యంలో జనసేనలో చేరారు.

అమలాపురం టౌన్, అక్టోబరు 24: ఉప్పలగుప్తం, అల్లవరం, అమ లాపురం మండలాలకు చెందిన వంద మందికిపైగా దళిత నాయకులు, యువత ఆదివారం నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వ ర్యంలో జనసేనలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో జనసేన పట్టణశాఖ అధ్యక్షుడు పిండి సాయిబాబా, నాయకులు మోకా బాలయోగి, సందాడి శ్రీనుబాబు, చిక్కాల సతీష్, చిక్కం భీముడు, మహాదశ నాగేశ్వరరావు, సూదా చిన్నా, పలువురు ఎంపీటీసీ సభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.