క్రీడా స్ఫూర్తితో మెలగాలి
ABN , First Publish Date - 2021-03-21T06:05:29+05:30 IST
క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి అన్నారు. ఎంఎస్ఎన్ చార్టీస్ ఆవరణలో జిల్లా హ్యాండ్బాల్ సంఘం ఆధ్వర్యంలో 6వ రాష్ట్రస్థాయి ప్రసంగి వెంకటరత్నం స్మారక హ్యాండ్బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఎమ్మెల్యే ద్వారంపూడి
కాకినాడస్పోర్ట్స్, మార్చి 20: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి అన్నారు. ఎంఎస్ఎన్ చార్టీస్ ఆవరణలో జిల్లా హ్యాండ్బాల్ సంఘం ఆధ్వర్యంలో 6వ రాష్ట్రస్థాయి ప్రసంగి వెంకటరత్నం స్మారక హ్యాండ్బాల్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలకు హాజరైన వివిధ జిల్లాల క్రీడాకారులు తమతమ జిల్లాలకు పేరు తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి క్రీడలకు రాష్ట్రంలో పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఇండోర్లో జరిగే జాతీయస్థాయి పోటీలలో రాణించాలన్నారు. పోటీల నిర్వాహకులు దుర్గాప్రసాద్, ఎస్.వెంకటేశ్వరరావును ఆయన అభినందించారు. రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు ఎస్.కృష్ణకుమార్ మాట్లాడుతూ హ్యాండ్బాల్ సంఘం మాజీ కార్యదర్శి ఎన్.నర్సింహమూర్తి వద్ద శిక్షణ పొందిన 80 మంది హ్యాండ్బాల్ క్రీడాకారులు వివిధ శాఖల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారన్నారు. కార్పొరేటర్లు చవ్వాకుల రాంబాబు, చోడిపల్లి సత్యప్రసాద్, మీసాల శ్రీదేవి దుర్గాప్రసాద్, మీసాల ఉదయ్కుమార్, సీఐ రాంమోహన్రెడ్డి, మల్లాడి శివరాంనాయక్, పీడీలు ఎల్.గోవింద్, డాక్టర్ కె.స్పర్జన్రాజు, రంగారావు, భాను, జిల్లా హ్యాండ్బాల్ సంఘ కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరావు, పీడీ స్వామి, పోటీల నిర్వహణా కార్యదర్శి రవికుమార్, సత్తిరాజు, భవాని, పోటీల పరిశీలకుడు వంశీ తదితరులు పాల్గొన్నారు. శనివారం నిర్వహించిన పోటీలలో గుంటూరుపై తూర్పు, శ్రీకాకుళంపై పశ్చిమగోదావరి, పశ్చిమగోదావరిపై కృష్ణ, విజయనగరంపై తూర్పు విజయం సాధించాయి.