ముగిసిన హ్యాండ్బాల్ పోటీలు
ABN , First Publish Date - 2021-03-22T05:55:39+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా హ్యాండ్బాల్ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ ఆవరణలో జరుగుతున్న ప్రసంగి వెంకటరత్నం స్మారక సీనియర్స్ రాష్ట్రసాయి హ్యాండ్ బాల్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి.
![ముగిసిన హ్యాండ్బాల్ పోటీలు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కాకినాడ స్పోర్ట్స్, మార్చి 21: తూర్పుగోదావరి జిల్లా హ్యాండ్బాల్ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ఎంఎస్ఎన్ చార్టీస్ ఆవరణలో జరుగుతున్న ప్రసంగి వెంకటరత్నం స్మారక సీనియర్స్ రాష్ట్రసాయి హ్యాండ్ బాల్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఈ పోటీలలో కర్నూలు ప్రథమ, విశాఖ ద్వితీయ, తూర్పు తృతీయ స్థానాలు సాధించాయి. పోటీల ముగింపోత్సవానికి సంఘం అఽధ్యక్షుడు దుర్గాప్రసాద్ అఽధ్యక్షత వహించారు. ఐడియల్ జూనియర్ కళాశాల పీడీ తాతబ్బాయి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఎస్.వెంకటేశ్వరరావు, వై.సాగర్, రవికుమార్, బాబ్జి, స్వామి తదితరులు పాల్గొన్నారు.