గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
ABN , First Publish Date - 2021-04-11T06:38:21+05:30 IST
స్థానిక శీలంవారి సావరం రోడ్లోని సాయి కిరాణా షాపులో గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్.ఐ పి.విజయశంకర్ శనివారం దాడి చేశారు.
రామచంద్రపురం, ఏప్రిల్ 10: స్థానిక శీలంవారి సావరం రోడ్లోని సాయి కిరాణా షాపులో గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్.ఐ పి.విజయశంకర్ శనివారం దాడి చేశారు. రూ.55వేలు విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దుకాణం యజమాని సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.