జీఎస్‌టీ పెంపును ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-19T07:12:12+05:30 IST

కేంద్ర ప్రభుత్వం వసా్త్రలపై విధించిన అదనపు జీఎస్‌టీ (5 శాతం నుంచి 12 శాతానికి) పెంపునకు నిరసనగా కాకినాడలో శనివారం పెద్దఎత్తున ప్రదర్శన జరిగింది.

జీఎస్‌టీ పెంపును ఉపసంహరించుకోవాలి
కాకినాడ మెయిన్‌రోడ్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న వస్త్ర వ్యాపారులు

జీఎస్‌టీ పెంపునకు నిరసనగా కాకినాడ వస్త్ర వ్యాపారుల నిరసన

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 18 : కేంద్ర ప్రభుత్వం వసా్త్రలపై విధించిన అదనపు జీఎస్‌టీ (5 శాతం నుంచి 12 శాతానికి) పెంపునకు నిరసనగా కాకినాడలో శనివారం పెద్దఎత్తున ప్రదర్శన జరిగింది. ది కాకినాడ క్లాత్‌ అండ్‌ రెడీమేడ్‌ మర్చంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు పాల్గొని పన్నుల పెంపుపై ఆందోళన వ్యక్తంచేశారు. పెంచిన జీఎస్‌టీ పన్నుల వల్ల అటు ప్రజలు, ఇటు వ్యాపారులపై పెనుభారం పడుతుందని, తక్షణం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని వ్యాపారులు డిమాండు చేశారు.

Updated Date - 2021-12-19T07:12:12+05:30 IST