ఫెన్సింగ్ పోటీలలో ఓవరాల్ చాంపియన్స్ తూర్పు
ABN , First Publish Date - 2021-11-02T05:34:16+05:30 IST
జిల్లా ఫెన్సింగ్ సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలలో తూర్పు గోదావరి జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిందని ఫెన్సింగ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగం సతీష్బాబు తెలిపారు.
![ఫెన్సింగ్ పోటీలలో ఓవరాల్ చాంపియన్స్ తూర్పు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921110212013124/11022021000304n85.jpg)
కాకినాడ స్పోర్ట్స్, నవంబరు 1: జిల్లా ఫెన్సింగ్ సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలలో తూర్పు గోదావరి జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించిందని ఫెన్సింగ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగం సతీష్బాబు తెలిపారు. ఈ పోటీలలో ద్వితీయస్థానంలో ప్రకాశం, తృతీయస్థానంలో పశ్చిమగోదావరి జట్లు నిలిచాయన్నారు. విజేతలకు కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివప్రసన్న, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్ మెడల్స్ను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ శివప్రసన్న మాట్లాడుతూ ఫెన్సింగ్ శిక్షణ నిమిత్తం కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఒక హాలును ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజారపు మహేష్, ఫెన్సింగ్ సంఘ అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, కార్యదర్శి మోహన్, కోశాధికారి చంద్రకళావతి, ప్రసాద్కుమార్, వేణుగోపాలరెడ్డి, క్రిష్టఫర్, రామాంజనేయులు పాల్గొన్నారు.