ఈవీఎంల పరిశీలన
ABN , First Publish Date - 2021-03-24T06:07:28+05:30 IST
ఈవీఎం యంత్రాల భద్రతకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మురళీధర్రెడ్డి అధికారులను ఆదేశించారు.

డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), మార్చి 23: ఈవీఎం యంత్రాల భద్రతకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మురళీధర్రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గొడౌన్లను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.