వైద్య శిబిరం నిర్వహణ ఆనందకరం: జేసీ
ABN , First Publish Date - 2021-10-18T04:46:16+05:30 IST
కార్పొరేషన్ (కాకినాడ), అక్టోబరు 17: పనిఒత్తిడిలో ఉండే మీడియా సోదరులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు రెడ్డి సంక్షేమ సంఘం, కాకినాడ మీడియా హౌస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ
కార్పొరేషన్ (కాకినాడ), అక్టోబరు 17: పనిఒత్తిడిలో ఉండే మీడియా సోదరులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు రెడ్డి సంక్షేమ సంఘం, కాకినాడ మీడియా హౌస్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ అన్నారు. శ్రీనగర్లో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, జేసీ లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.