AP: షష్టి వేడుకల్లో యువకుల మధ్య వివాదం
ABN , First Publish Date - 2021-12-11T13:47:37+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గుళ్ళలో షష్టి వేడుకల్లో యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది.
రాజమండ్రి: తూర్పగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గుళ్ళలో షష్టి వేడుకల్లో యువకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని యువకులను చెదరగొట్టారు. దీంతో రెచ్చిపోయిన యువకులు ఆలయంలో కుర్చీలు, పోలీసు జీప్ అద్దాలు ధ్వంసం చేశారు. కాగా.. సీతానగరం ఎస్ఐ దాడి చేశారన్న మనస్థాపంతో బంటుమిల్లి రాజేష్ అనే యువకుడు బ్లేడ్తో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.