విద్యుదాఘాతంతో యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-04-13T06:47:27+05:30 IST
విద్యుదాఘాతంతో ఒక యువకుడి మృతి చెం దాడు.
పి.గన్నవరం, ఏప్రిల్ 12: విద్యుదాఘాతంతో ఒక యువకుడి మృతి చెం దాడు. అంబాజీపేట మండలం ఇరుసుమండ శివారు ఎస్ఎస్ నగర్కు చెం దిన వార సాయినాథ్ మండలంలోని ఆర్.ఏనుగుపల్లి శివారు కారుపల్లిలో ఒక ఇంటికి రంగులు వేసేందుకు వచ్చాడు. బిల్డిండ్పైకి ఎక్కి రంగులు వేస్తుండగా విద్యుత్తీగలు తగిలాయి. పి.గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి శ్రీనివాసు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.