పంట ధ్వంసంపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-04-13T06:48:19+05:30 IST
పంట ధ్వంసంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎల్.శ్రీనునాయక్ తెలిపారు.
కొత్తపేట, ఏప్రిల్ 12: పంట ధ్వంసంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎల్.శ్రీనునాయక్ తెలిపారు. వానపల్లి శివారు సత్తెమ్మలంక గ్రామానికి చెందిన కొమ్ముల నాగమణికి చెందిన రెండెకరాల భూమిని కపిలేశ్వపురం మండలం అద్దంకివారిలంకకు చెందిన సంగాడి సుబ్బారావు ఆరేళ్లుగా కౌలు చేస్తున్నాడు. ఆ భూమికి సంబంధించి గొడవలు ఉన్నాయని, చేను ఖాళీ చేయాలని వానపల్లికి చెందిన కొమ్ముల సద్గురుమూర్తి తదితరులు అరటి పంటను నాశనం చేశారని సుబ్బారావు ఫిర్యాదు చేశాడు.