అవినీతిరహిత సమాజాన్ని నిర్మిద్దాం

ABN , First Publish Date - 2021-11-02T05:33:32+05:30 IST

అవినీతిరహిత సమాజాన్ని నిర్మించే సామర్థ్యం యువతకు మాత్రమే ఉందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు.

అవినీతిరహిత సమాజాన్ని నిర్మిద్దాం

దివాన్‌చెరువు, నవంబరు 1: అవినీతిరహిత సమాజాన్ని నిర్మించే సామర్థ్యం యువతకు మాత్రమే ఉందని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం సహకారంతో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వారోత్సవం నిర్వహించగా వీసీ పరిశీలించారు. కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. వాణిజ్య సమన్వయకర్త ఎన్‌.ఉదయభాస్కర్‌, అధ్యాపకులు బీబీ అహ్మద్‌ అలీ, ఐవోసీఎల్‌ రాజమహేంద్రవరం డివిజన్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎంఎన్‌ పృధ్వీరాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T05:33:32+05:30 IST