ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు: కలెక్టర్
ABN , First Publish Date - 2021-08-20T07:01:50+05:30 IST
ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.హరికిరణ్ ఎన్నికలు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గొడౌన్ను ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
![ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు: కలెక్టర్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కాకినాడ సిటీ, ఆగస్టు 19: ఎలకా్ట్రనిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)ల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.హరికిరణ్ ఎన్నికలు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం, వీవీ ప్యాట్ గొడౌన్ను ఆయన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గొడౌన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి భద్రతా సిబ్బంది గొడౌన్ చుట్టూ తనిఖీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో సీహెచ్.సత్తిబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్.రత్నబాబు, కాకినాడ ఆర్డీవో ఏజీ.చిన్నికృష్ణ, అర్బన్ తహసీల్దార్ వైహెచ్ఎస్ సతీష్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు ఎం.జగన్నాధం, జె.రమేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పసుపులేటి వెంకటేశ్వరరావు (టీడీపీ), రావూరి వెంకటేశ్వరరావు (వైసీపీ), చెక్క రమేష్ (బీజేపీ), సుబ్బారపు అప్పారావు (బీఎస్పీ) పాల్గొన్నారు.