సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలంబాట
ABN , First Publish Date - 2021-10-14T06:29:46+05:30 IST
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలం బాట పట్టారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఆయన 12 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేపట్టిన విషయం తెలిసిందే.
![సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలంబాట](https://media.andhrajyothy.com/appimg/galleries/1921101412582642/10142021005944n36.jpg)
ప్రత్తిపాడు,
అక్టోబరు 13: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పొలం బాట పట్టారు.
ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఆయన 12 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరి సాగు
చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రెండు నెలల్లో పొలం సాగు ఏ విధంగా ఉందో
తెలుసుకునేందుకు బుధవారం ఆయన తన కౌలు పొలంలోకి వచ్చి పరిశీలించారు.
బ్లాక్ రైస్తో పాటు వివిధ రకాల వరిని ఆయన 12 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
ప్రస్తుతం చేను చిరుపొట్ట దశకు చేరుకుంది. ఈ పొలంలో కలుపు మొక్కలు,
చీడపీడలు ఏమైనా ఆశించాయా అనే దానిపై ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పంట
ఏపుగా పెరగి దిగుబడికి వచ్చే ఈనక దశకు చేరుకోవడంతో ఆయన సంతోషం వ్యక్తం
చేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు స్థానికులు కలిశారు.