బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2021-01-25T07:07:11+05:30 IST
ఎవరిపేరునో ఉన్న భూమి తమదంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఫొటోలతో కరపత్రాల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్.కొత్తపల్లి ఫీల్డ్లేబర్ సొసైటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉప్పలగుప్తం, జనవరి 24: ఎవరిపేరునో ఉన్న భూమి తమదంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఫొటోలతో కరపత్రాల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎన్.కొత్తపల్లి ఫీల్డ్లేబర్ సొసైటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సొసైటీ అధ్యక్షుడు నేరేడుమిల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కరపత్రాలపై చర్చించారు. 1962లో ఫీల్డ్లేబర్ సొసైటీకి ప్రభుత్వం 162ఎకరాల భూమిని ఇచ్చిందని, ఆ భూమిని కొందరు సొంతంగా, మరికొందరు కౌలుకు ఇవ్వడం ద్వారా లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లికి 1.94ఎకరాల భూమి ఉందని పాతూరి రమేష్ ఇటీ వల అధికారపార్టీ ప్రజాప్రతినిధుల ఫొటోలతో కరపత్రాలు పంచి, డబ్బు కోసం తమను వేఽధిస్తున్నాడని అన్నారు. రమేష్పై చర్యలు తీసుకుని లేబర్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయానని ఎస్ఐ వెంకటేశ్వరరావును కోరారు.