ఐదు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-08-27T06:50:32+05:30 IST
జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్క కేసు నమో దు కాకపోవడంతో కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్యాధికారులు భావించారు.
![ఐదు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
జీజీహెచ్ (కాకినాడ), ఆగస్టు 26: జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసుల ఉధృతి కొనసాగుతోంది. బుధవారం ఒక్క కేసు నమో దు కాకపోవడంతో కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్యాధికారులు భావించారు. జిల్లాలో కొత్తగా గురువారం ఐదు బ్లా క్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వ్యాధి బారిన పడి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 47కు చేరింది. కొవిడ్ సెకండ్ వేవ్ నుంచి నేటివరకు బ్లాక్ఫంగస్ చికిత్సకోసం జీజీహెచ్లో 430మంది చేరగా వ్యా ధినుంచి 270మంది రోగులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.