పోటాపోటీగా వైసీపీ భోగి మంటలు

ABN , First Publish Date - 2021-01-14T06:40:20+05:30 IST

కాపవరంలో బుధవారం భోగి సందర్భంగా వైసీపీలో వైరి వర్గాలు ఒకే ప్రాంతంలో ప్రక్కప్రక్కన భోగి మంటలు వేశారు.

పోటాపోటీగా వైసీపీ భోగి మంటలు

బస్తాల్లో దొరికిన ఉపాధి హామీ రికార్డులు
అంబాజీపేట, జనవరి 13: చిరతపూడి ఉపాధి హామీ పథకానికి సంబంధించి మంగళవారం నాలుగు బస్తాల్లో రికార్డులు దొరికాయి. ఆ రికార్డులను పంచాయతీ, రెవెన్యూ అధికారులు పోలీసులకు అప్పగించారు.


ద్రాక్షారామ, జనవరి 13: కాపవరంలో బుధవారం భోగి సందర్భంగా వైసీపీలో వైరి వర్గాలు ఒకే ప్రాంతంలో ప్రక్కప్రక్కన భోగి మంటలు వేశారు. గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రధాన అనుచరుడు మాజీ ఉపసర్పంచ్‌ రెడ్నం సతీష్‌కు,  ప్రత్యర్థి వర్గానికి రాజకీయ వైరం ఉంది. గతంలో సతీష్‌ టీడీపీలో ఉండగా ప్రత్యర్థి వర్గం వైసీపీలో ఉండేది. అయితే గత ఏడాది సతీష్‌ తోట త్రిమూర్తులుతో పాటు వైసీపీలో చేరారు. దీంతోపాటు ఎంపీటీసీ వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అయితే సతీష్‌ను తీవ్రంగా వ్యతిరేకించే యనమదల  కాశి సతీష్‌కు పోటీగా వైసీపీ రెబల్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.  సతీష్‌ వర్గం ఒకే బోగిమంట వేయగా కాశీవర్గం పక్కనే మరో భోగిమంట వేసింది. పక్కపక్కనే వెలుగుతున్న రెండు భోగి మంటలు వైసీపీలో వైరానికి తార్కాణంగా నిలిచాయి.

Updated Date - 2021-01-14T06:40:20+05:30 IST