ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-11-21T06:54:19+05:30 IST
కాజులూరుకు చెందిన వెలుగుబంట్ల రామారావు(68) ఉరి వేసుకుని శనివారం మృతి చెందాడు.

కాజులూరు, నవంబర్ 20: కాజులూరుకు చెందిన వెలుగుబంట్ల రామారావు(68) ఉరి వేసుకుని శనివారం మృతి చెందాడు. రామారావు శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంటికి రాకపోయేసరికి ఊరంతా గాలించారు. గోగులమ్మగుడి ఎదుట ఉన్న సైకిల్ షాపుపాకలో ఉరి వేసుకుని మృతిచెంది ఉన్నాడు. గొల్లపాలెం ఎస్ఐ ఎం.పవన్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మానసికస్థితి సరిగా లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందని ఎస్ఐ తెలిపారు.