యువకుడి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2021-05-08T06:31:50+05:30 IST
యానాం ఫరంపేటకు చెందిన పంతగడ కిషోర్(18) అనుమానాస్పద స్థితితో మృతిచెందాడు.

యానాం, మే 7: యానాం ఫరంపేటకు చెందిన పంతగడ కిషోర్(18) అనుమానాస్పద స్థితితో మృతిచెందాడు. రెండు రోజుల కితం ఏడుగురు యువకులు గ్రామంలోని శివారు లంక ప్రాంతానికి తాటి ముంజులు కోసం వెళ్లారు. అయితే ఇద్దరు యువకులు తిరిగి రాలేదు. వీరిలో కిషోర్ శుక్రవారం గోదావరిలో శవమై తేలాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.