మహిళ మెడలో గొలుసు అపహరణ

ABN , First Publish Date - 2021-11-23T07:15:43+05:30 IST

మహిళ మెడలో గొలుసు అపహరణపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పీవీవీఎస్‌ఎన్‌ సురేష్‌ సోమవారం రాత్రి తెలిపారు.

మహిళ మెడలో గొలుసు అపహరణ

రాయవరం, నవంబరు 22: మహిళ మెడలో గొలుసు అపహరణపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పీవీవీఎస్‌ఎన్‌ సురేష్‌ సోమవారం రాత్రి తెలిపారు. రాయవరానికి చెందిన పంపన దుర్గా కార్తీక సోమవారం గ్రామంలో శివాలయం, సత్తెమ్మ తల్లి ఆలయాల వద్ద పూజలు జరిపి తిరిగి ఇంటికి వెళ్తుండగా స్థానిక సత్తివారివీధి వద్దకు వచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మూడు కాసుల బంగారు గొలుసు ఆమె మెడలో నుంచి తెంచుకుని వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.




Updated Date - 2021-11-23T07:15:43+05:30 IST