600 కిలోల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-05-08T06:05:09+05:30 IST
ప్రత్తిపాడు జాతీయ రహదారిపై గోవిందపురం కొండ జంక్షన్ సంతోషిమాత ఆలయం వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు.

ప్రత్తిపాడు, మే 7: ప్రత్తిపాడు జాతీయ రహదారిపై గోవిందపురం కొండ జంక్షన్ సంతోషిమాత ఆలయం వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ప్రత్తిపాడు సీఐ వై.రాంబాబు, ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా పాడేరు నుంచి రాజమహేంద్రవరానికి బొలెరో వాహనంలో 600 కిలోల గంజాయిని లోడ్చేసి శుక్రవారం ఇద్దరు వ్యక్తులు బయల్దేరారు. ఈ వాహ నం హైవేపై గల సంతోషిమాత ఆలయం వద్దకు చేరుకోగానే పోలీ సులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి దొరికిపోవడంతో డ్రైవర్ పరారయ్యాడు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం కిన్నెర్లకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. తహశీల్దార్ పీపీవీ గోపాలకృష్ణ సమక్షంలో గంజాయిని, వాహనాన్ని సీజ్ చేశారు. 14 మూటల్లో ఉన్న 600 కిలోల గంజాయి మార్కెట్ విలువ రూ.15 లక్షల వరకు ఉంటుందని సీఐ తెలిపారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.