జనార్ధనస్వామికి 108 వెండి కలువ పువ్వుల వితరణ
ABN , First Publish Date - 2021-11-21T06:52:44+05:30 IST
ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన అద్దంకి సూర్యప్రకాశరావు రేణుక దంపతులు రూ.2.30లక్షల విలువైన 108 వెండి కలువ పువ్వులను బహూకరించారు.
ఆలమూరు, నవంబరు 20: ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయానికి హైదరాబాద్కు చెందిన అద్దంకి సూర్యప్రకాశరావు రేణుక దంపతులు రూ.2.30లక్షల విలువైన 108 వెండి కలువ పువ్వులను బహూకరించారు. వీటిని ఆలయ ఈవో సీహెచ్.సత్యనారాయణ, ఆలయ ప్రధానార్చకుడు ఖండవల్లి ప్రభాకరాచార్యులకు అందించారు. దాత దంపతులను వనుం సూరిబాబు అభినందించారు.