సర్పంచుల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌

ABN , First Publish Date - 2021-11-22T05:20:48+05:30 IST

జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఖాతాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఒక్కసారిగా పంచాయతీ ఖాతాలో రూ.లక్షల డబ్బులు మాయం కావడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.

సర్పంచుల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌

చిత్తూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచుల ఖాతాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఒక్కసారిగా పంచాయతీ ఖాతాలో రూ.లక్షల డబ్బులు మాయం కావడంతో సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల కిందట 15వ ఆర్థిక సంఘం మొదటి క్వార్టర్‌ నిధులు రూ.23.96 కోట్లు, రూ.36 కోట్ల చొప్పున రెండు విడతలుగా మంజూరయ్యాయి. పంచాయతీ స్థాయిని బట్టి ఈ నిధులను కేటాయించారు. పారిశుధ్య పనులు, తాగునీటి పథకాల మరమ్మతులు, కార్మికుల జీతాలు, పంచాయతీ అభివృద్ధికి దాదాపు 60శాతం నిధులు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. శనివారం సీఎఫ్‌ఎంఎస్‌కు లింక్‌ అయి ఉన్న సర్పంచుల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ చూపించింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అధికారులూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయమై డీపీవో దశరథరామిరెడ్డిని వివరణ కోరగా.. సోమవారం రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి కారణాలను కనుక్కుంటామన్నారు.

Updated Date - 2021-11-22T05:20:48+05:30 IST