అనధికార లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు

ABN , First Publish Date - 2021-12-09T06:34:28+05:30 IST

మదనపల్లె మండలంలోని గ్రామాల్లో వేసిన అనధికార లేఅవుట్లలో హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో లీలామాధవి చెప్పారు.

అనధికార లేఅవుట్లలో హెచ్చరిక బోర్డులు
కోళ్లబైలు పంచాయతీలో వేసిన అనధికార లేఅవుట్‌లో హెచ్చరికబోర్డు ఏర్పాటు చేస్తున్న ఎంపీడీవో లీలామాధవి

మదనపల్లె రూరల్‌, డిసెంబరు 8: మండలంలోని గ్రామాల్లో వేసిన అనధికార లేఅవుట్లలో హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేసినట్టు ఎంపీడీవో లీలామాధవి చెప్పారు. బుధవారం మదనపలె మండలంలోని పొన్నూటిపాలెం పంచాయతీ సర్వేనెం.361, 363లో 4 ఎకరాల్లో, కోళ్లబైలు పంచాయతీ సర్వేనెం.596-3, 591-1లలో 5.96ఎకరాల్లో పంచాయతీ అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ల హె చ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డీవో మాట్లాడుతూ గ్రామాల్లో లేఅవుట్లు వేస్తున్న రియ ల్టర్లు పంచాయతీకి ఎకరాకు 10సెంట్ల స్థలం, 33 అడు గుల రోడ్డు వేసి అనుమతి తీసుకోవాలన్నారు. అనుమ తులు లేని  సర్వేనెంబర్లలో వేసిన లేఅవుట్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శులు సుశీల, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T06:34:28+05:30 IST