బస్సుల ఢీ: 15 మందికి గాయాలు

ABN , First Publish Date - 2021-10-30T04:58:25+05:30 IST

రెండు బస్సులు ఢీకొనడంతో 15 మంది గాయపడిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది.

బస్సుల ఢీ: 15 మందికి గాయాలు
ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు

ఏర్పేడు, అక్టోబరు 29: రెండు బస్సులు ఢీకొనడంతో 15 మంది గాయపడిన సంఘటన ఏర్పేడు మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు... శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండలంలోని మేర్లపాక వద్దకు వచ్చింది. అదే సమయంలో వెనుకే వస్తున్న మరో ఆర్టీసీ బస్సు వేగంగా వస్తూ ఈ బస్సును ఢీకొంది. ఈ సంఘటనలో 15 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-30T04:58:25+05:30 IST