విద్య, వైద్యం, వ్యవసాయరంగాలపై రేపు సదస్సు

ABN , First Publish Date - 2021-10-20T07:43:42+05:30 IST

తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10 గంటలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై సదస్సు నిర్వహించనున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తెలిపారు.

విద్య, వైద్యం, వ్యవసాయరంగాలపై రేపు సదస్సు
మీడియాతో మాట్లాడుతున్న జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణ్‌రెడ్డి

తిరుపతి(తిలక్‌రోడ్డు), అక్టోబరు 19: తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఆడిటోరియంలో గురువారం ఉదయం 10 గంటలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై సదస్సు నిర్వహించనున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్‌కల్లాం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, ఇతర ప్రముఖులు హాజరవుతారన్నారు. విద్యార్థులు, రైతులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు హాజరుకావాలని కోరారు. ఈసమావేశంలో పురుషోత్తంరెడ్డి, విజయలక్ష్మి, యశోద, షేక్‌ మహ్మద్‌రఫీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T07:43:42+05:30 IST