నేడు వేతనంతో కూడిన సెలవు
ABN , First Publish Date - 2021-04-17T06:58:07+05:30 IST
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా శనివారం వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ బాలునాయక్ తెలిపారు.
ఉప కార్మిక కమిషనర్ బాలునాయక్
తిరుపతి(ఆటోనగర్), ఏప్రిల్ 16: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక సందర్భంగా శనివారం వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తున్నట్లు ఉప కార్మిక కమిషనర్ బాలునాయక్ తెలిపారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో దుకాణాలు, మాల్స్, వర్క్షాపు, చిన్న, మధ్య, భారీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొన్నారు. కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. యజమానుల నుంచి ఇబ్బందులు ఎదురైతే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.